యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అరవింద సమేత.దసరాకి విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న(మంగళవారం) హైదరాబాద్లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం భావోద్వేగంతో సాగింది.ఎన్టీఆర్ తండ్రి మాజీ ఎంపీ హరికృష్ణ నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.దీంతో అరవింద సమేత సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని భావించారు అంత,కాని తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని ,తండ్రి హరికృష్ణ చనిపోయిన ఐదు రోజులకే అరవింద సమేత షూటింగ్లో పాల్గొన్నాడు ఎన్టీఆర్.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ చాలా దుఃఖంతో మాట్లాడాడు.ఓ నెల రోజులు క్రితం మా ఇంట్లో జరిగిన సంఘటన నన్ను షాక్ గురి చేసింది.మా నాన్న హరికృష్ణ గారు భౌతికంగా మన దగ్గర లేకపోయిన ఆయన ఆశీస్సులు మాతోనే ఉంటాయాని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న తన అన్న కల్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది.ఇక ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో కన్నీరు ఆపలేక కొన్ని నిమిషాలపాటు స్టేజీ మీదే అలా ఉండిపోయారు.