సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్. ఎంతో కష్టపడి స్టార్డం సంపాదించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్లో ఎన్ని ఇబ్బందులు పడ్డానో చెబుతూ అనేకసార్లు వార్తల్లోకెక్కింది. అంతేకాదు కొన్ని రోజులుగా రాజకీయ అంశాల గురించి కామెంట్లు చేస్తూ బీజేపీకి మద్దతుదారు అనే ముద్ర వేయించుకుంటోంది. ముంబైని పీఓకేతో పోల్చడం, రైతు ఆందోళనలకు మద్దతుగా ఉంటున్న వారిని టెర్రరిస్టులు అంటూ వ్యాఖ్యలు చేయడంతో వివాదాల్లో చిక్కుకుంది.
అయినా ఆమె క్రేజ్ తగ్గడం లేదు. తలైవి వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పాటు మరికొన్ని మూవీస్ కూడా కంగన చేతిలో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది ఈ అమ్మడు. ఇక కెరీర్, వివాదాల గురించి కాసేపు పక్కనపెడితే, వ్యక్తిగతంగా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది కంగన. సినిమాల్లోకి వెళ్తానంటే తొలుత సహకరించనప్పటికీ, ఇప్పుడు ఆమెను అర్థం చేసుకుని దగ్గరైన ఫ్యామిలీ మెంబర్్సకు అన్ని విధాలా అండగా ఉంటోంది.
ఇక తోడబుట్టిన వాళ్లు రంగోలి, అక్షత్ అంటే ఆమెకు మమకారం ఎక్కువే. అందుకే వారిద్దరి కోసం ఢిల్లీకి సమీపంలో విలాసవంతమైన అపార్టమెంటు కట్టిస్తోందట పెద్దక్క కంగన. వాళ్లతో పాటు కజిన్్సకు కూడా ఇందులో వాటా ఇస్తోందట. ఈ విషయాన్ని కంగనానే ట్విటర్లో తెలిపింది. దీంతో నెటిజన్లు కంగనను ఉద్దేశించి.. చెల్లి, తమ్ముడిపై మీకు ఎంత ప్రేమ ఉందో అని కామెంట్లు చేస్తున్నారు. అన్నట్లు ప్రభాస్ సినిమా ఏక్ నిరంజన్తో ఈ భామ టాలీవుడ్ను పలకరించిన సంగతి తెలిసిందే.
అది మరి బన్నీ అంటే.. ఆ మాత్రం ఉంటుందిలే!
ప్రభాస్ ఆదిపురుష్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం