బాలీవుడ్ సంచలన తార కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె పలు కాంట్రవర్సీ విషయాలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. కాస్టింగ్ కౌచ్, బాలీవుడ్ వారసత్వం,డ్రగ్స్ ఒక్కటేమిటి ఏ విషయంలో అయినా కంగనా నేనున్నా అంటూ ముందుకు వచ్చి తనదైన స్టైల్లో కామెంట్స్ చేస్తుంది… అందుకే ఆమెను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటారు.
అలాంటి కంగనా ట్విట్టర్ ఖాతా శ్వాశ్వతంగా క్లోజ్ అయ్యింది. వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేయడం ద్వారా ట్విట్టర్ నియమ, నిబంధనలను కంగనా బ్రేక్ చేస్తున్నారంటూ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం చోటు చేసుకున్న హింసపై కంగనా చేసిన వ్యాఖ్యలు తమ నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ట్విట్టర్ స్పష్టం చేసింది.
కంగనా పదేపదే తమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, విద్వేషపూరిత వైఖరి, దూషణలతో కూడిన ప్రవర్తన కనబరుస్తున్నారని ట్విట్టర్ వెల్లడించింది.
వామ్మో.. ఆ ఊరిలో ఒక్కసారే 600మందికి కరోనా పాజిటివ్.. ఇద్దరు మృతి
మృతదేహాన్ని పీక్కుతింటోన్న వ్యక్తి.. భయంతో వణికిపోయిన జనాలు
ఊపిరి పీల్చుకుంటున్న ముంబాయి.. భారీగా పడిపోయిన కొత్త కేసులు!