Sunday, April 28, 2024
- Advertisement -

వామ్మో.. ఆ ఊరిలో ఒక్కసారే 600మందికి క‌రోనా పాజిటివ్.. ఇద్దరు మృతి

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కరోనా వస్తే పెద్ద నేరం చేసిన వారిలా చూస్తున్నారు. ఎంతగా అంటే.. సొంత వారే కరోనా రోగులను దూరంగా ఉంచుతున్నారు.. వారిని కలవాలంటే భయపడిపోతున్నారు. కరోనా వైరస్ ఇట్టే ఇతరులకు సోకుతుందన్న భయం ప్రతి ఒక్కరిలో నెలకొంది. అలాంటిది సగం ఊరు ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది.

ఈ దయనీయ ప‌రిస్థితి వికారాబాద్‌ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కరోనా ధాటికి ఊరంతా చెల్లాచెదురైంది. 1400 మంది జ‌నాభా ఉన్న ఆ గ్రామంలో నేడు .. వారిలో సుమారు 600 మందికి కరోనా వైరస్‌ సోకింది. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడి వారం క్రితం ఇద్దరు మృతి చెందారు. కరోనా భయానికి తమ ఇంటిని వదిలివేసి తమ సొంత పొలాల వద్ద గుడిసెలు వేసుకొని జీవించే పరిస్థితి నెలకొంది.

అధికారులు తమ గోడు వినిపించుకోవడం లేదని వాపోతున్నారు. అయితే గ్రామంలో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేసి అందరికీ టెస్టులు చేయాలని ఇటీవల గ్రామానికి వచ్చిన కలెక్టర్‌కు విన్నవించారు. అయినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే రోజూ ఏఎన్‌ఎం మాత్రం గ్రామానికి వచ్చి వెళ్తోన‌ట్టు‌ గ్రామస్థులు చెబుతున్నారు.

కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో కోఆప్షన్‌ మెంబర్‌ జాఫర్‌ జేసీబీల సాయంతో గుంతలు తవ్వించి మృతదేహాలను పూడుస్తున్నారు.

మృత‌దేహాన్ని పీక్కుతింటోన్న వ్య‌క్తి.. భయంతో వణికిపోయిన జనాలు

హైపర్ ఆది అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టిన.. దొరబాబు భార్య అమూల్య!

వామ్మో.. పుష్ప షూటింగ్ వెనుక అంత ప్లాన్ ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -