Sunday, April 28, 2024
- Advertisement -

బ్రిటన్ యువరాజు ఆహ్వానానికి కరీనా నో

- Advertisement -

బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేట్ విలియం ఈ నెల 10 న భారత్ కు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ దంపతుల రాక కోసం భారత్ లో అనేక మంది ఎదురుచూస్తున్నారు. ముంబాయ్ లో అతిరథ మహారధులతో కలిసేందుకు యువరాజు దంపతులు కూడా ఎదురుచూస్తున్నారు. వారి గౌరవార్ధం ముంబాయ్ లో ఓ విందు ఏర్పాటు చేశారు.

ఆ విందులో పాల్గొనాలంటూ బాలీవుడ్ భామ కరీనా కపూర్ ని ఆహ్వానించారు. ఇలాంటి ఆహ్వానం ఎవరికైనా రావాలే కాని ఎగిరి గంతేసి మరీ వెళ్తారు. అయితే కరీనా మాత్రం అబ్బే.. నే రాను.. నాకు ఖాళీ లేదు.. అంటూ దీర్ఘాలు పోయింది.

ఈ విందుకు రాకపోవడానికి కారణం ఏమిటమ్మా అని అడిగితే తన భర్త సైఫ్ ఆలీ ఖాన్ షూటింగ్ కు వెళ్తున్నారని, భర్త లేకుండా తాను ఒంటరిగా యువరాజును కలవలేనని తెగేసి చెప్పేసింది ఈ అమ్మడు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ వంటి లెజెండ్స్ హాజరవుతున్నా… కరీనా మాత్రం రానంటే రానని మెండికేస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -