మహనటి సినిమాతో హీరోయిన్ కీర్తి సురేష్ ఇమేజ్ అమాంతం పెరిగిపొయింది.సావిత్రి జీవిత కథను మహనటి సినిమాగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తి పోషించింది.మహనటి సినిమాలో సావిత్రిగా కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి.దీంతో మరో ప్రతిష్టాత్మక బయోపిక్లో కీర్తి సురేష్ను తీసుకున్నారన్న ప్రచారం జరిగింది.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథను సినిమాగా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
జయలలిత పాత్రకు కీర్తి అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆశిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.అయితే విషయంపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు. జయలలిత బయోపిక్కు సంబంధించి ఇంతవరకు తనను ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది కీర్తి సురేష్.రాజమౌళి మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఎటువంటి స్పష్టత లేదు.