- తొలిసారి తెలుగులో డబ్బింగ్
పవర్స్టార్ పవన్కల్యాణ్ 25వ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభం నుంచి పలు ఆసక్తికరమైన అంశాలు తెలుస్తూ వస్తున్నాయి. పవన్కు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. తనకు ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకని అందరూ సక్సెస్ ఫుల్ హీరోయిన్లు, ప్రముఖ నటులను తీసుకుంటున్నారు. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. కొలవెరి వంటి సూపర్ పాటతో ప్రపంచాన్ని ఊపేసిన అతడిని ఈ సినిమాకు తీసుకున్నారు. ఈ విధంగా సినిమా పనులు జరుగుతున్నాయి. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేస్తున్న సినిమా మరో అత్తారింటికి దారేది అవుతుందని పవన్ ఆశిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో నేను శైలజ ఫేమ్ కీర్తి సురేశ్ నటిస్తోంది. ఆమె తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పేసింది. తాను తొలిసారిగా తెలుగు డబ్బింగ్ చెప్పానని మురిసిపోతూ ట్విట్టర్లో ఓ ఫొటోను పెట్టారు. ఇదివరకు తెలుగులో చేసిన సినిమాలకు డబ్బింగ్ వేరేవాళ్లు చెప్పుకున్నారు. తెలుగులో తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మొదటిసారి. అందుకే చిన్న ఎక్జాయిట్మెంట్తో ఉన్నట్లు ఆ ఫొటో చూస్తే తెలుస్తోంది. కీర్తి సురేశ్కు సినిమా అవకాశాలు బోలెడు వస్తున్నాయి. నేను శైలజ, నేను లోకల్ తదితర సినిమాలు విజయం సాధించాయి. పవన్ సినిమాతో పాటు సావిత్రి అనే సినిమాలో కీర్తి నటిస్తోంది.