టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో సీనియర్ నటుడు అర్జున్ నటిస్తున్నాడు.
అయితే అర్జున్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు అని అంతా భావించారు. అయితే అర్జున్ పాత్రపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో అర్జున్ పోలీస్ గా నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సర్కారు వారి పాట సినిమా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే దుబాయిలో కంప్లీట్ చేసుకుంది. అతి త్వరలోనే మరో షెడ్యూల్ మొదలు కాబోతోంది.
Also Read: బిగ్బాస్ సీజన్ -5 హోస్ట్ ఎవరంటే?
కాగా సర్కారు వారి పాట సినిమాకు యంగ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ బాబు ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటించనున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక మూవీ లో నటించనున్నాడు.