ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గమనించారా!అవును మీరు చూస్తున్నది అలనాటి నటి సావిత్రి ఫోటో కాదు ఇప్పటి హీరోయిన్ కీర్తి సురేష్ ఫోటో. ఈ ఫోటోలో కీర్తి సురేష్ అచ్చం సావిత్రిలా ఉంది కదా .సావిత్రి జీవిత కథను బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే.సావిత్రిగా హీరోయిన్ కర్తి సురేష్ చేస్తుంది. అప్పటి హీరోయిన్ జమున పాత్రలో హీరోయిన్ సమంత, ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ చేస్తున్నాడు.ఈ సినిమా ట్రైలర్ మొన్న ఆ మధ్య విడుదల చేశారు. ట్రైలర్కు మంచి రెస్పన్స్ వచ్చింది. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజిగా ఉంది.విడుదల తేది దగ్గర పడుతున్న కొద్ది చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ పెంచేసింది.
తాజాగా మీరు చూస్తున్న ఫోటో టాక్ ఆఫ్ ది సినీ కంట్రీ అనిపించుకుంటుంది.అసలు ఈ ఫోటోని చూసిన వారందరికి ఇది కీర్తి సురేష్ అనే భావనే రావడం లేదు. సావిత్రి మళ్లీ పుట్టిందని అందరు భావిస్తున్నారు. ఈ ఫోటోని చూస్తుంటే ఇది దేవదాస్ సినిమాలోని ఫోజులా ఉంది.మరి సినిమా విడుదలకు ముందే ఇన్ని సంచనాలను చూపిస్తుంటే , సినిమా విడుదల తరువా ఇంకా ఎన్ని సంచనలను చూపిస్తారో చూడాలి. మహనటి సినిమా మేలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తుంది.