Friday, April 26, 2024
- Advertisement -

తెలుగు ని వదిలేయలేను అంటున్న కైరా!

- Advertisement -

భరత్ అనే నేను అనే సినిమా తో తెరంగేట్రం చేసిన భామ కైరా అద్వానీ. మహేష్ బాబు హీరో గా చేసిన ఈ సినిమా కి కొరటాల శివ దర్శకుడు. కైరా అద్వానీ కి ఈ సినిమా లో ఒక మంచి పాత్ర దక్కింది. అలాగే కైరా కి కూడా ఈ సినిమా తో మంచి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత కైరా నటించిన సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా మాత్రం పెద్దగా ఎవరినీ మెప్పించలేదు. కైరా పాత్ర కూడా ఈ సినిమా లో పెద్దగా ఎవరినీ ఆకట్టుకోలేదు. అయినప్పటికీ కైరా మాత్రం తెలుగు సినిమా లు వదులుకోవడానికి ఇష్ట పడడం లేదు.

తెలుగు సినిమా పరిశ్రమ లో ఇంకా సినిమాలు చేస్తూ ఉంటాను అని ఇటీవలే కైరా తెలిపింది. ఇప్పటికీ ఎవరో ఒకరు తనకి స్క్రిప్ట్స్ పంపిస్తున్నారు అని, అవి అవి చదువుతూ ఉన్నట్లు కైరా చెప్పింది. అందులో కొన్ని కైరా కి బాగా నచ్చినట్టు కూడా తెలుస్తుంది. “తప్పకుండా తెలుగు లో భవిష్యత్తు లో సినిమాలు చేస్తాను. నేను తెలుగు పరిశ్రమ కి బాగా కనెక్ట్ అయ్యాను. ఇక్కడ సినిమాలని వదులుకోను నేను.” అని తాను చెప్పింది.

ప్రస్తుతం హిందీ లో కబీర్ సింగ్ విడుదల తో సంతోషం గా ఉన్న కైరా త్వరలో నే గుడ్ న్యూస్, లక్ష్మి బాంబ్, ఇందు కా జవాణీ, షేర్ షా చిత్రాల తో బిజీ గా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -