సినిమాలు ప్రేక్షకుల కోసం.. అభిమానుల కోసం.. ప్రజలకు వినోదం అందించడం అని ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా చివరికు వారు నటించేది మాత్రం రెమ్యునరేషన్ కోసమే. అది అందరికీ తెలిసినా పైకి ఆ విధంగా చెబుతారు. సినిమాలు ఎంత హిట్టయితే అంత రెమ్యునరేషన్ రేటును పెంచేస్తుంటారు. అయితే టాలీవుడ్తో పోలిస్తే బాలీవుడ్లో రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. చిన్నచిన్న నటీనటులకు కూడా అరకోటి ముట్టచెబుతారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరీ అక్కడ ఇచ్చుకున్నంతే ఇక్కడ కూడా ఇచ్చుకోవాలని కండీషన్స్ పెడుతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో కైరా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడంతో తన తర్వాతి సినిమాకు రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఈ సినిమా విడుదల కాలేదు కానీ తర్వాతి సినిమా అవకాశం వచ్చేసింది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్రణ్ సినిమాలో కైరా నటించనుంది. అయితే ఈ సినిమాకు భారీగా అడిగింది అని సమాచారం. ఈ రెండు సినిమాల మధ్య ఆమె రేటు చాలా తేడా ఉంది.
‘భరత్ అనే నేను’ సినిమాకు దాదాపు రూ.అరకోటికి పైగా అడిగేసింది. ఇప్పుడు రామ్చరణ్ సినిమా కోసం ఏకంగా డబుల్ రేట్ అడిగింది అని తెలుస్తోంది. ఎందుకంటే మహేశ్ సినిమాతో క్రేజీ వస్తుంది ఎలాగైనా. మరీ దాన్ని క్యాష్ చేసుకోవాలని కైరా ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. రెమ్యునరేషన్ విషయాన్ని కూడా ముందే చెప్పడంతో నిర్మాతలు ఆలోచించి చివరికి ఒకే చెప్పేశారంట.