బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వాని తెలుగులో మహేష్ బాబు భరత్ అను నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేసింది కైరా.ఇక తెలుగులో కైరా అద్వానికి తెలుగులో వరస అవకాశాలు వస్తున్నాయి.కైరా అద్వాని ప్రస్తుతం రామ్ చరణ్-బోయపాటి సినిమాలో హీరోయిన్గా చేస్తుంది.అయితే కైరాకు తెలుగులో ఇలా వరుసగా అవకాశాలు రావడానికి కారణం నమ్రతనేట!మహేష్ బాబు భార్య నమ్రతకు కైరాకు భరత్ అనే నేను సినిమా షూటింగ్ సమయంలోనే స్నేహం ఏర్పడిందట.
మహేష్ ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పరుచుకున్న కైరాకు నమ్రత హీరోయిన్గా సిఫార్స్ చేస్తుందని సమాచారం.అలా సిఫర్స్ చేస్తేనే చరణ్ .. బోయపాటి సినిమాలోను ఛాన్స్ దొరికిందని చెప్పుకుంటున్నారు.తాజాగా హైదరాబాద్ వచ్చిన రా అద్వానీ నమ్రతను కలుసుకుని, ఆ రోజంతా కూడా వాళ్లతో కలిసి సందడి చేసిందట. ఆ సందర్భంలోనే నమ్రతతోను మహేశ్ కూతురు సితారతోను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Thankyou for all your suggestions guys.. since I had only a few hours, these are a some of the places I managed to visit on your recommendation #Charminar #Salarjungmuseum ❤️ #DayWellSpent #Hyderabad pic.twitter.com/7eluQU6SgP
— Kiara Advani (@advani_kiara) June 18, 2018