ఎ.కోదండరామిరెడ్డి.. టాలీవుడ్ లోని ఒకానొక పెద్ద దర్శకుడు. దాదాపు వంద సినిమాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి.
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో సహా టాలీవుడ్ లోని స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన నేపథ్యం ఉంది కోదండరామిరెడ్డికి. అయితే దాదాపు దశాబ్దకాలం నుంచి ఆయన కెరీర్ స్లో అయ్యింది. సీనియర్లకు టాలీవుడ్ లో క్రేజ్ తగ్గిపోయిన నేపథ్యంలో కోదండరామిరెడ్డికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
ఇదే సమయంలో ఆయన తన తనయుడిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు. వైభవ్ ను హీరోగా పరిచేయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో సినిమాను రూపొందించాడు. అంది అంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నిర్మాతగా మారి తనయుడితో ఒకటీ రెండు సినిమాలు రూపొందించాడు. అవి కూడా అంత సక్సెస్ కాలేదు. అయితే వైభవ్ తమిళంలో నటుడిగా గుర్తింపు సంపాదించుకొన్నాడు. వెంకట్ ప్రభు దర్వకత్వంలో వచ్చే ప్రతి సినిమాలోనూ వైభవ్ కనిపిస్తూ ఉంటాడు.
ఇలాంటి నేపథ్యంలో అతడు.. తాజాగా తన డైరెక్షన్ ఆలోచనలను బయటపెట్టాడు. భవిష్యత్తులో సినిమాలకు దర్శకత్వం వహించే ఆలోచన ఉందని చెప్పుకొన్నాడు. తను గతంలో కొన్ని సినిమాలకు పూరీ జగన్నాథ్ వద్ధ పనిచేసినట్టుగా వైభవ్ వివరించాడు. మరి భవిష్యత్తులో దర్శకుడిగా మారే ఆలోచన ఉందని వైభవ్ చెప్పుకొన్నాడు. మరి ఆ రంగంలో ఇతడు ఏ మేరకు సత్తా చాటతాడో చూడాలి!