Friday, March 29, 2024
- Advertisement -

ఆ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టిన బేబమ్మ?

- Advertisement -

బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. నటించిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ విజయం కావడంతో హీరోయిన్ కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి.ఈ క్రమంలోనే వరుస అవకాశాలతో ఎంతో బిజీగా మారిన ఈ అమ్మడుకి కరోనా కాస్త బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు.

కరోనా కారణంగా ఇన్ని రోజులు సినిమాలకు బ్రేక్ పడటంతో ఇంట్లోనే ఉన్న ఈమె కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో తిరిగి సినిమాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె నటిస్తున్న”ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది”. సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Also read:ఆ కారణంగానే సినిమాలకు దూరమయ్యా… నటి సదా!

చాలా రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి కావడంతో పూర్తిగా తన దృష్టి మొత్తం ఈ సినిమాపైనే పెట్టినట్లు తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే కృతి శెట్టి తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో పాల్గొననున్నారు. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లేలోపు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోని ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నాని సరసన “శ్యామ్ సింగరాయ్” సినిమాలో కూడా బేబమ్మ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:ఫోటో వైరల్: ఆర్ఆర్ఆర్ ఫోటోను మార్ఫింగ్ చేసిన వార్నర్‌…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -