Sunday, May 5, 2024
- Advertisement -

ఫిదా మూవీకి ఫిదా అయిన మంత్రి కేటీఆర్

- Advertisement -

వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఫిదా. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఓ సినిమాకి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. ప్రముఖల నుంచి ఈ సినిమాకి ప్రశంసలు అందుతున్నాయి. ఇటివలే తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సినిమా పై ప్రశంసలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఫిదా సినిమాపై ప్రశంసలు కురింపించారు.

తెలంగాణ నేప‌థ్యంలో అంద‌మైన ప్రేమ‌క‌థా గా తెరకెక్కిన సినిమా తనని త‌న‌ని ఫిదా చేసింద‌ని అన్నారు. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు శేఖ‌ర్ క‌మ్ముల‌కి ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ‌జేశారు. జూలై 21న విడుద‌లైన ఫిదా చిత్రం ఇప్ప‌టికి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ సునామి సృష్టిస్తూనే ఉంది. అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఫిదా మూవీ తెర‌కెక్కింది. ఇక ఈ సినిమా వ‌రుణ్ తేజ్ కెరియ‌ర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. శ‌క్తికాంత్ అందించిన సంగీతం ఈ సినిమాకి ఎంతో ప్లస్ అయిందని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -