Saturday, April 20, 2024
- Advertisement -

అమ్మాయిలను ఏడిపిస్తున్న జబర్దస్త్ టీమ్ లీడర్.. ఎవరంటే?

- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో విజయవంతంతో దూసుకుపోతుంది. ఈ షోలో పాల్గొనే కమెడియన్లు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకొను స్టార్ సెలబ్రెటీలుగా మారిపోయారు. ఇలాంటి వారిలో టీమ్ లీడర్ వెంకీ ఒకరు.మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన వెంకీ ప్రస్తుతం పలు కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వెంకీ పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండే వెంకీ పై తాజాగా ఒక అమ్మాయిని వేధించాడని ఆరోపణలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అమ్మాయి తరపు వారు వేదికపైనే వెంకీ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మల్లెమాల వారు నిర్వహిస్తున్న రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమంలో వెంకీ తన స్కిట్ ల ద్వారా సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాజీవ్ కనకాల జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Also read:పిల్లల అద్భుత ఆరోగ్యానికి సూపర్ టిప్స్ ఇవే!

ప్రతి గురువారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా వెంకీ ఒక అమ్మాయిని వేధిస్తున్నాడంటూ కొందరు వ్యక్తులు ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. జడ్జ్ ముందే వారు వెంకీతో గొడవకు దిగారు.ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడమే కాకుండా, సదరు యువతి కూడా అక్కడికి వచ్చినట్లు ప్రోమోలో చూపించారు. ఈ ఘర్షణలో వెంకీ పై బూతులు తిడుతూ గాయపరచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇదంతా షోలో భాగంగానే నిర్వహించినట్లు పలువురు భావిస్తున్నారు. అయితే ఇది నిజమా లేక ఫ్రాంకా అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

Also read:కమ్మటి రుచిని ఇచ్చే టమోటా రసం.. ఎలా చేయాలంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -