- Advertisement -
ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. సినిమాపై ఈరోజు ఏపి హైకోర్ట్ ఏదోఒక తీర్పు ఇస్తుందని దర్శక నిర్మాతలు ఉదయం నుంచి ఆసక్తిగా ఎదురు చూశారు. కాని అనూహ్యంగా వారి ఆశలకు గండికొట్టింది హైకోర్టు. క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విచారణను ఏప్రిల్ 9 వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీం కోర్ట్ లో దీనికి సంబంధించిన కేసు పెండింగ్ లో ఉన్న కారణంగా ఎలాంటి తీర్పు ఇవ్వలేమని చెప్పింది.
సినిమా ప్రివ్యూ కూడా చూడలేమని హైకోర్టు న్యాయమూర్తులు కేసును ఏప్రిల్ 9కి వాయిదా వేశారు. ఇప్పటికే చిత్రయూనిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సినిమా విడుదల కాకపోవటంతో తమకు నష్టాలు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్ల హైకోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు.హైకోర్ట్ తీసుకున్న నిర్ణయంపై వర్మ , చిత్రం నిర్మాత ఎలా స్పందిస్తాడో చూడాలి