ఎన్నికలు దగ్గరపడుతున్న రాజకీయ నేపథ్యంతో వస్తున్న చిత్రాలు పెను సంచలనాన్ని చూపుతున్నాయి. ఇకమీదట చూపనున్నాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యాత్ర’ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వైఎస్ఆర్ రూపొందించిన పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసింది ఈ సినిమా.
ఇక మరో వైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ను చూశాక ఈ సినిమా రాజకీయాల్లో కల్లోలం సృష్టిస్తుందనడంలో డౌటే లేదని కన్ఫామ్ అయింది. అధికార పార్టీలో ఎన్టీఆర్ వీరాభిమానులు ఎక్కువ. రామ్గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ మరణంకు కొన్ని రోజుల ముందు ఆయన అనుభవించిన అత్యంత బాధాకర సంఘటనలు చూపించాడు. ట్రైలర్ లోనే ఏ రేంజ్ లో ఎన్టీఆర్ ను కుటుంబ సభ్యులు ఆడుకున్నారో చూపించే ప్రయత్నం చేశారు వర్మ.
కొన్ని డైలాగులైతే టీడీపీ అధినేత చంద్రబాబును డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాయి. నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు వాడిని నమ్మడం అంటూ కన్నీటి పర్యమంతవుతూ భావోద్వేగంతో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ చాలా ఎఫెక్ట్ చూపనుంది. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ పడ్డ మానసిక సంఘర్షన పైనే ఈ సినిమా పూర్తిగా ఆధారపడి ఉంటుందని అర్థమవుతోంది.
ఇక చంద్రబాబు వాయిస్లో వచ్చే మరో డైలాగ్.. ఆనాటి రాజకీయాల్లో, నందమూరి కుటుంబాల్లో పెను సంచలనం సృష్టించినట్టు వర్మ చెప్పకనే చెప్పారు. దానికి పిల్లలు పుడితే మీ ఫ్యామిలీ ఫినిష్ అని చంద్రబాబు వాయిస్లో డైలాగ్ వస్తుంది. ఈ వ్యాఖ్యలే ఆనాటి రాజకీయాలను తలకిందులు చేసి.. బంటును రాజుగా.. రాజును బంటుగా మార్చిందని చెప్పవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇంకా ఇలాంటి చిచ్చు పెట్టే డైలాగులు లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఎన్ని ఉన్నాయో చిత్రం విడుదల అయితే కానీ తెలియదు. ఈ ఫినిష్ డైలాగ్ చంద్రబాబును మటాష్ చేసేలా ఉందని తీవ్ర చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిళ్లలో. మొత్తానికి వర్మ రాజకీయాల్లో తీవ్ర కల్లోలం రేపడం ఖాయంగా తెలుస్తోంది.