Sunday, April 28, 2024
- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యేకు మ‌రో సారి ఘాటు కౌంట‌ర్ ఇచ్చిన వ‌ర్మ‌….

- Advertisement -

వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌’ సినిమాపై రేగుతున్న దుమారం ఏమాత్రం చ‌ల్లార‌ట్లేదు. ఇప్ప‌టికే వ‌ర్మ‌కు వ్య‌తిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు త‌మ్ముళ్లు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు తెలిపి..దిష్టి బొమ్మ‌ను ద‌హ‌నం చేసిన సంగ‌తి తెలిసిందే. క‌ర్నూలు టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వ‌ర్మ‌పై కేసు పెట్టారు. వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌’ సినిమాలోని వెన్నుపోటు పాటలో చంద్రబాబును కించప‌రిచే విధంగా ఉంద‌ని తన ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తాజాగా ఎస్వీ మోహ‌న్ రెడ్డికి వ‌ర్మ మ‌రో సారి ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎన్టీఆర్‌పై ఎందుకు కేసు పెట్టలేదని ఎస్వీ మోహన్‌రెడ్డిని ట్విటర్‌లో వర్మ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ బతికుండగా ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -