మాస్ చిత్రాలను తెరకెక్కిండం పూరి జగన్నాథ్కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే ఎన్నో మాస్ చిత్రాలను తీసి సక్సెస్ సాధించాడు పూరి. ప్రస్తుతం పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో లైగర్ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ తిరుగులేని మాస్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సైతం యూత్ను తెగ ఆకట్టుకున్నాయి. లైగర్ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీతో విజయ్ రేంజ్ దేశవ్యాప్తంగా పెరుగుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘లైగర్’ ఫస్ట్ లుక్ ప్రస్తుతం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో అత్యధిక లైక్లు రాబట్టుకుని దక్షిణాది చిత్రాల్లో తొలి ఫస్ట్లుక్ పోస్టర్గా నిలిచింది. ఈ ఫస్ట్లుక్ పోస్టర్ ఇన్స్టాగ్రామ్లో దాదాపు 2 మిలియన్లకు పైగా లైక్స్ను సాధించి రికార్డు సృష్టించింది. ఇక మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్, అటు పూరీ జగన్నాథ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.