Sunday, April 28, 2024
- Advertisement -

రవితేజను లైన్లో పెడుతున్న పూరీ!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు గాంచిన పూరీ జగన్నాథ్ కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ మద్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్స్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ మూవీ తరువాత పూరీ డైరెక్షన్ లో వచ్చిన ఇజం, మెహబూబా, ఘోరంగా నిరాశ పరచగా, మద్యలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని తో తీసిన ” ఇస్మార్ట్ శంకర్ ” మూవీ కాస్త పరవలేదనిపించింది. ఇక ఆ తరువాత వచ్చిన రొమాంటిక్ మూవీ మళ్ళీ ఫ్లాప్ ల బాటా పట్టాడు పూరీ జగన్నాథ్.. ఇక ఇటీవల వచ్చిన లైగర్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ కావడంతో.. పూరీ డైరెక్షన్ లో నటించేందుకు ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు..

అంతే కాకుండా లైగర్ మూవీ ఫైనాన్సియల్ పరంగా భారీ నష్టాలను తీసుకురావడంతో ఆ నష్టాలను భర్తీ చేయాలంటే పూరీ మళ్ళీ స్ట్రాంగ్ గా కామ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కెరియర్ మొదట్లో తనకు లైఫ్ ఇచ్చిన మాస్ రాజ రవితేజతో మూవీ చేసేందుకు పూరీ సిద్దామౌతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ కు ఇండస్ట్రీ లో స్పెషల్ క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో ” ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు ” వంటి సినిమాలు వచ్చాయి.ఒక్క దేవుడు చేసిన మనుషులు మూవీ తప్పా మిగిలిన అన్నీ మూవీస్ కమర్షియల్ గా మంచి సక్సస్ సాధించాయి. దీంతో ప్రస్తుతం పూరీ ఉన్న పరిస్థితుల్లో స్ట్రాంగ్ గా కామ్ బ్యాక్ ఇవ్వాలంటే తనకు లైఫ్ ఇచ్చిన రవితేజ నే కరెక్ట్ అని పూరీ భావిస్తున్నాడట. అందుకే రవితేజతో మూవీ ప్లాన్ చేసేందుకు సిద్దమౌతున్నట్లు టాక్. ఇక పూరీ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో వెళితే రవితేజ కూడా ఒకే అనడం ఖాయం. మరి రవితేజతోనైనా పూరీ కామ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మహేశ్ రాజమౌళి ప్రాజెక్ట్ ఒకే కావడానికి అసలు కారణం ఆదేనా?

కే‌జి‌ఎఫ్ ను ఫాలో అవుతున్న సలార్ !

మహేశ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -