Sunday, May 12, 2024
- Advertisement -

ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే ఉండడం

- Advertisement -

ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే ఉండడం అన్నది అందరికీ సాధ్యం కాని పని. అత్యున్నత స్థాయికి చేరుకున్న ఎంతో మంది తప్పటడుగులు వేసి పేరు పోగొట్టుకున్న సందర్భాలు మనం చాలా చూస్తూనే ఉన్నాం. కానీ.. ఇలాంటి పరిస్థితి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్.. తలైవా.. రజినీకాంత్ భిన్నం.

తనను అభిమానించేవారు దేశంలోనే కాదు.. విదేశాల్లో ఉన్నా కూడా.. ఆయన ఎన్నడూ తన ప్రవర్తనలో ఆ స్టార్ డమ్ చూపించుకోలేదు. ఎదిగిన కొద్దీ.. ఒదిగే ఉన్నారు. రోజురోజుకూ తన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా మార్చుకున్నారు.

గతంలో కండక్టర్ గా పని చేసిన రజినీకాంత్.. వీలు చిక్కినప్పుడల్లా మంచి కార్యక్రమాలకు భూరి విరాళాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి.. అలాంటి ఉదారతనే చాటుకున్నారు.. రజినీ. ప్రతిష్టాత్మకమైన నదుల అనుసంధానం ప్రాజెక్ట్ పై ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దేశ ప్రజల నీటి కష్టాలు తీర్చే ఈ ప్రాజెక్టులో తానూ భాగం కావాలని నిర్ణయించుకున్నారు.

నదుల అనుసంధానం ప్రక్రియకు తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ప్రక్రియ మొదలవగానే.. ఈ మొత్తాన్ని సంబంధిత అధికారులకు అందజేస్తామని రజినీ సోదరుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా అభిమానులు.. దటీజ్ రజినీకాంత్ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -