మ్యాచో హీరో గోపీచంద్.. తెలుగు ప్రేక్షకులను అలరించి చాలా కాలమే అయ్యింది. తాజాగా దర్శకుడు మారుతి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ ను దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఇప్పటికే విడుదలైన ఆ పాటకు మంచి స్పందన వస్తోంది.
ఈ సాంగ్ విడుదల సమయంలో చిత్రాన్ని మే 20న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించినా.. ఆ తేదీకి సినిమా విడుదల కావట్లేదని తెలుస్తోంది. దాంతో జూలై 1 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ మూవీకి బన్నీ బాసు నిర్మాత.
జూలై 1న పక్కా అనేలా తెలుపుతూ.. ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. కెరీర్ ఎప్పుడూ లేనంతగా గోపీచంద్ ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నాడు. గోపీచంద్ కు జంటగా రాశీ ఖన్నా అలరించబోతోంది. ఈ సినిమాలో కట్టప్ప సత్యరాజ్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు.
క్రేజీ కాంబినేషన్లో మరో మల్టీ స్టారర్ మూవీ