బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా సారా అలీఖాన్ హీరోయిన్గా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సింబా’ సినిమా చేస్తున్నాడు. తెలుగులో వచ్చిన ‘టెంపర్’ సినిమాకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ తమిళ నటుడు మాధవన్ను ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో మాధవన్ మోచేతికి తీవ్ర గాయాలయ్యాయి. సర్జరీ చేయడంతో ఆ గాయాల నుంచి కోలుకోవడానికి కొన్నాళ్లు వైద్యులు విశ్రాంతి తీసుకోమన్నారు.
అయితే ముందస్తుగా ప్రకటించిన డేట్స్ ప్రకారం సింబా సినిమా కోసం మాధవన్ ఇవ్వలేకపోయాడు. దీంతో ఆ సినిమా నుంచి మాధవన్ను తీసేశారు. ఈ విషయంపై మాధవన్ బాధపడుతున్నాడు.‘నేను రోహిత్ శెట్టికి, అతడి సినిమాలకు ఫ్యాన్ను. నా కుమారుడు కూడా. నాకు గాయం కావడంతో ‘సింబా’ సినిమాలో నేను భాగం కాలేకపోతున్నా. ఇందుకు నేను, నా కుమారుడు చాలా బాధపడుతున్నాం. ఈ విషయం గుర్తుచేసుకున్నప్పుడల్లా మా గుండెలు పగిలిపోతుంటాయి’ అని ట్వీటర్లో మాధవన్ భావోద్వేగానికి గురయ్యాడు.మాధవన్ ప్రస్తుతం నాగచైతన్య చేస్తున్న సినిమా ‘సవ్యసాచి’లో చైతూ బావగా కనిపిస్తున్నాడు.