హీరోయిన్ మాధవిలత మెగాస్టార్ చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసింది.ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతు ఫ్యాన్స్ మధ్య అధిపత్యం గురించి చెప్పుకొచ్చింది.హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్.. అభిమానుల గొడవలు, కులాల కుమ్ములాటలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదని,ఎన్లీఆర్ ,కృష్ణ సమయంలోనే వచ్చాయాని,కాని ఇప్పుడు హీరోలు దానిని పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారని ఆమె పేర్కొంది.
ఫ్యాన్ ఫాలోయింగ్ను బట్టి మనం అంచనాకు రాలేమని అలా అనుకుంటే చిరంజీవి ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవారని ఆమె తేల్చేసింది.స్టార్లను దేవుళ్లుగా కొలిచే సంస్కృతి పోయిందని, వాళ్లు కూడా మనలాంటి మనుషులేనన్న నిజాన్ని నెమ్మదిగా జనం తెలుసుకుంటున్నారని మాధవీ లత అన్నారు. ఇక వచ్చే ఎలెక్షన్స్లో తను పోటీ చేయడం లేదని స్పష్టం చేసింది మాధవి లత.ఆమె బిజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.అయితే పార్టీ ఆదేశిస్తే మాత్రం ప్రచారం చేస్తానని తెలిపింది.