Thursday, May 9, 2024
- Advertisement -

మ‌హేశ్ సినిమాలో అదే హైలెట్ కానుందా?

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు త‌న 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం మ‌హేశ్ ఫ‌స్ట్ టైం ఫుల్ గెడ్డంతో క‌నిపంచ‌నున్నాడు. ఇటీవల డెహ్రాడూన్ లో ఫస్ట్ షెడ్యూల్ ను ముగించుకొని చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. అక్క‌డే సినిమాలోని కొన్ని కీల‌క స‌న్నివేశాలను తెర‌కెక్కించారు. సినిమాలో ఇక్క‌డ తెర‌కెక్కించిన స‌న్నివేశాలే సినిమాకు హైలెట్ కానున్నాయని స‌మాచారం. డెహ్రాడూన్‌లో తెరకెక్కించిన కళాశాల ఎపిసోడ్ చిత్రానికే హైలైట్ గా నిలవనుందట. ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ మహేష్ బర్త్ డే సందర్బంగా ఆగష్టు 9న విడుదలకానుందని తెలుస్తుంది.

ఇక సినిమాలో పూజ హెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తుంది.ఇక ఈ సినిమా రైతుల గురించి ఎక్కువుగా ఉటుంద‌ని ఇండ‌స్ట్రీలో గుస గుస‌లు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు , అశ్వినీదత్‌లు ఇద్ద‌రు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -