Friday, May 17, 2024
- Advertisement -

భ‌రత్‌లో కొత్త సీన్స్!

- Advertisement -

మహేష్ బాబు తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను సినిమా బాక్సాఫిస్ ద‌గ్గ‌ర కలెక్ష‌న్ల సునామి సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఏప్రిల్ 20న విడుద‌లైన ఈ సినిమా విడుద‌ల రోజు నుండే సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపొతుంది.సినిమాలో యంగ్ సీఎంగా మ‌హేష్ న‌ట‌న‌కు అన్ని వైపుల నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి.ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని సీన్స్ యాడ్ చేస్తార‌ని స‌మాచారం.సినిమా మొత్తం 5 గంట‌ల సినిమాను సరిపడా కంటెంట్ చేతికొస్తే దాన్ని కుదించి 2 గంటల 53 నిమిషాల లెంగ్త్ తో ఫైనల్ కట్ రెడీ చేశామని కొరటాల చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కొన్ని మంచి సీన్లను కూడా తీసేయాల్సి వచ్చిందట. ఐతే ఇప్పుడు అలా మిస్సయిన కొన్ని సీన్లను సినిమాకు జోడించబోతున్నారట. అయితే ఈ సీన్ల‌ను ఎప్పుడు యాడ్ చేస్తారో మాత్రం చెప్ప‌లేదు.ఈ వారాంతంలో తిరుపతి వేదికగా సక్సెస్ మీట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కైరా అద్వానీ చేసిన సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -