తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో తాజా వివాదం పెను సంచలనలకు దారి తీస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు మా కార్యదర్శి నరేష్.మా అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నిధుల కోసం అమెరికాలో చిరంజీవితో నిర్వహించిన కార్యక్రమంలో కొంత డబ్బుని మిస్ యూజ్ చేశారని, ఈ విషయంలో శివాజీరాజాకి ‘మా’లో మరికొంతమంది మెంబర్స్ సహాయం చేశారని ప్రధాన ఆరోపణ.
ఈ విషయంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి నిజాలు తెలుసుకోవాలని ప్రధాన కార్యదర్శి నరేష్ అంటున్నారు.ఈ వివాదంలోకి చిరంజీవి పేరు రావడంపై ఆయన మా సభ్యులపై కాస్తా సీరియస్ అయినట్లు సమాచారం.ఈ విషయం తేలేవరకు ఫారెన్ టూర్ వేయడానికి వీళ్లేది లేదని హీరోలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలలో అమెరికాలో మహేష్ బాబుతో ఈవెంట్ చేయించాలని ‘మా’ అసోసియేషన్ భావించింది.నమ్రతతో మాట్లాడి మహేష్ బాబుతో ఈవెంట్ ఫిక్స్ చేశారు మా సభ్యులు.మహేష్ ఈ ప్రోగ్రాం చేస్తే ‘మా’కి కోటి రూపాయలు నిధులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మహేష్ బాబు ‘మా’ అసోసియేషన్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.
వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబు ఇటువంటి పరిస్థితుల్లో షో చేయడం కరెక్ట్ కాదని భావించి క్యాన్సిల్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ వివాదంపై చిరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.తాజాగా మహేశ్ కూడా అమెరికా ఈవెంట్ నుంచి తప్పుకోవడం ‘మా’ కుపెద్ద దెబ్బే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.