- Advertisement -
సుదీర్ బాబు హీరోగా, అదితి రావు హీరోయిన్గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సమ్మోహనం. తాజగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు సుదీర్ బాబు తన ట్వీటర్ ద్వారా తెలియజేశాడు.ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నింటికి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.
సినిమాలోని మాటలు, పాటలు, లొకేషన్లు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వినోదం ఈ సినిమాకు హైలెట్గా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జూన్ 10న జరుగుబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు సూపర్స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్న విషయం తెలిసిందే.