Friday, May 17, 2024
- Advertisement -

ఆ విష‌యంలో మ‌హేశ్‌కు థ్యాంక్స్ చెప్పిన అక్ష‌య్ కుమార్‌

- Advertisement -

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన 2.0 సినిమా ట్రైల‌ర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది.మిలియ‌న్ల వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది.స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌పై టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు స్పందించారు.ట్విట్టర్‌లో 2.0 టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘విజువల్స్, కాన్సెప్ట్ అదిరిపోయింది. చిట్టి విధ్వంసాన్ని స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్న.

శంకర్, రజనీకాంత్ సార్, అక్షయ్ కుమార్, ఏఆర్ రహ్మన్ మరియు టీం మొత్తానికి నా అభినందనలు’’ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు.మ‌హేశ్ బాబు చేసిన ట్విట్‌కు అక్షయ్ కుమార్ స్పందించారు.మ‌హేశ్ చేసిన ట్విట్‌ను రీట్వీట్ చేసి ‘‘థ్యాంక్యూ’’ అని పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాను ఈ నెల 29న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -