యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అరవింద సమేత.దసరాకి విడుదల కానున్న ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న(మంగళవారం) హైదరాబాద్లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం భావోద్వేగంతో సాగింది.ఎన్టీఆర్ తండ్రి మాజీ ఎంపీ హరికృష్ణ నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.దీంతో అరవింద సమేత సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని భావించారు అంత,కాని తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని ,తండ్రి హరికృష్ణ చనిపోయిన ఐదు రోజులకే అరవింద సమేత షూటింగ్లో పాల్గొన్నాడు ఎన్టీఆర్.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ చాలా దుఃఖంతో మాట్లాడాడు.నెలకిందట ఓ సంఘటన జరిగింది (హరికృష్ణ మరణం). అది జరిగినప్పుడు చాలామంది సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కాదేమో? అనుకున్నారు.కాని వృత్తి ధర్మం ఎప్పుడు మరిచిపోకూడదని మా తాతగారు మా నాన్నగారికి చెప్పారు.మా నాన్న హరికృష్ణ గారు మాకు అదే చెప్పారు.రేపటి రోజున మా పిల్లలుకు కూడా మేం ఇదే నేర్పిస్తామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతు చాలా ఎమోషన్ల్ అయ్యాడు.ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకోవడం ఆయన అభిమానలను కదిలిచింది. నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎన్టీఆర్ స్పీచ్పై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు,ఎన్టీఆర్ మంచి స్నేహితులు అన్న సంగతి అందరికి తెలిసిందే.
మహేశ్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వెళ్లారు.హరికృష్ణ మరణించిన తరువాత ఇంటికి వెళ్లి మరి ఎన్టీఆర్ని ఓదార్చాడు మహేశ్.ఇక నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్పై కూడా మహేశ్ స్పందించారు.తారక్ తన మాటలతో నన్ను కూడా ఏడిపించాడు.తన తండ్రి మరణం వార్త నుంచి ఎన్టీఆర్ త్వరగానే కోలుకున్నాడని,ఈ విధాంగానే జీవితంలో ముందుకు సాగలని ఎన్టీఆర్ని కోరాడు మహేశ్.నీకు అండగా మేము ఎప్పుడు ఉంటామని తెలిపాడు మహేశ్.ఇక తన మిత్రులు ఇద్దరు(ఎన్టీఆర్-త్రివిక్రమ్) కలిసి చేస్తున్న అరవింద సమేత సినిమ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు మహేశ్ బాబు.