Friday, March 29, 2024
- Advertisement -

‘మ‌హ‌ర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌లు ఎవ‌రో తెలుసా..?

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు(బుధ‌వారం) ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు చిత్ర యూనిట్‌. గ‌వ‌ర్న‌ర్ రోడ్, పీపుల్ ప్లాజా దీనికి వేదిక కానుంది. మొద‌ట ఈ సినిమాకు ఎవ‌రు గెస్ట్‌లు రావ‌డం లేద‌ని భావించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇద్ద‌రు హీరోలు గెస్ట్‌లుగా వ‌స్తున్నార‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైనా దిల్ రాజు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్‌తో పాటు, టాలీవుడ్ స‌న్సేష‌నల్ స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా గెస్ట్‌లుగా హాజ‌రుకానున్నార‌ని దిల్ రాజు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. గ‌తంలో మ‌హేశ్ బాబు సినిమా శ్రీమంతుడు సినిమాకు గెస్ట్‌గా వ‌చ్చారు వెంకీ. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. తాజాగా వెంకీతోపాటు విజ‌య్ దేవ‌రకొండ కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్‌కు రావ‌డంతో అభిమానులు సంబంరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో మ‌హేశ్ బాబు మూడు డిఫరెంట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.

ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఇక ఈ సినిమాలో మ‌హేశ్‌కు జోడిగా పూజా హెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు ఈ సినిమా కోసం ప‌ని చేశారు.దిల్ రాజుతో పాటు అశ్వినీద‌త్‌, పీవీపీ ముగ్గురు క‌లిసి మ‌హ‌ర్షి సినిమాను నిర్మించారు. ఈ సినిమా మ‌హేశ్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో సినిమా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఈ సినిమాను ఈ నెల 9న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -