టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం మహర్షి. పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల అయిన టీజర్, సాంగ్స్కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ను ఫిక్స్ చేశాడు చిత్ర యూనిట్. . హైదరాబాద్లో మే 1వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ ఈవెంట్ ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
మహర్షి మహేశ్ బాబు కెరీర్లో 25వ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేశ్ ఫస్ట్ టైమ్ గెడ్డం , మీసం పెంచిన సంగతి అందరికి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేశ్ బాబుతో పని చేసిన దర్శకులు మహేశ్ గురించి చెప్పిన మాటలను ప్లే చేస్తారని సమాచారం. ఇలా మహేశ్ గురించి దర్శకులు చెప్పిన మాటలు ప్రీ రిలీజ్ ఈవెంట్కు స్పెషల్గా నిలస్తాయని భావిస్తున్నాంది మహర్షి టీమ్. అయితే ఈ సినిమాకు టాలీవుడ్కు చెందిన ఓ టాప్ హీరోని గెస్ట్గా పిలవలని భావిస్తున్నారట. అయితే అతను పేరు మాత్రం బయటికి రానివ్వడం లేదు. ఇక ఈ సినిమాను మే 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడనికి సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -
‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అదే స్పెషల్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -