Saturday, May 18, 2024
- Advertisement -

మ‌హేశ్‌ను విచారించిన పోలీసులు..ఎందుకో తెలుసా?

- Advertisement -

మ‌హేశ్‌ను పోలీసులు విచారించ‌డం ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ ….మ‌హేశ్ బాబు త‌న 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.దిల్ రాజు-అశ్వినీద‌త్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నా సంగ‌తి తెలిసిందే.మ‌హేశ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా పూజ హెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తుంది.ఈ సినిమాలో కీల‌క ఫైట్‌ను కాలేజీ గ్రౌండ్‌లో తెర‌కెక్కించాల‌ని చిత్ర ద‌ర్శ‌కుడు ప్లాన్ చేశాడు.దీనికోసం వంశీ పైడిపల్లి చాలా శ్రద్ధ తీసుకొని బాగా వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రికెట్ మ్యాచ్ ను చిత్రీకరించేందుకే తాజాగా మహేష్ తో కలిసి వంశీ తెలంగాణ పోలీస్ అకాడమీకి వెళ్లినట్టు తెలిసింది. క్రికెట్ మ్యాచ్ తో పాటు ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్లను ఈ అకాడమీలో చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరినట్టు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ అకాడమీలో షూటింగ్ పర్మిషన్ కోసం తాజాగా మహేష్-వంశీ వెళ్లారని తెలిసింది. పోలీసులు కూడా మహేష్ సినిమా షూటింగ్ కు సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో అల్ల‌రి నరేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -