సూపర్స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురుంచి ఇప్పుడు ప్రత్యేకంగా చేప్పుకోవాల్సిన అవసరం లేదు.అతను సినిమాలు ఓవర్ఆల్ ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంటాయి.స్పైడర్ నిరాశపర్చటంతో షుటింగ్లో ఉన్న భరత్ అను నేను సినిమా విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మహేష్.వేసవి సెలవులను క్యాష్ చేసుకునే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అను నేను మూవీని ఏప్రిల్ విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయించింది.
అయితే ఊహించని విధంగా ఆదే రోజు అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు ఇండియా మూవీలో కూడా రేస్ లోకి వచ్చాడు.మధ్యలో నేన్నాను అంటూ వచ్చాడు తలైవ.భరత్ అను నేను, నా పేరు ఇండియా మూవీలో ఒకే రోజు రిలీజ్ కావడం వల్ల పెద్ద ఇబ్బంది లేకపోయినా రోబో రాకతోనే అసలు సమస్య వచ్చింది.మూడు పెద్ద సినిమాలకు థియేటర్స్ ఎలా లభిస్తాయనేది ఇప్పడు పెద్ద ప్రశ్న. రోబో రిలీజ్ డేట్ మార్చాలని ఇప్పటికే నిర్మాతలు డివివి దానయ్య, బన్నీ వ్యాస్ లు పట్టుపడుతున్నారు.
రోబో తెలుగు వెర్షన్ రెండు వారాల అనంతరం రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇది ఎంతవరకు ఫలిస్తుందో తెలీయనీ స్థితిలో భరత్ అను నేను మూవీని ముందుకు జరిపే ఆలోచనలో ఉంది ఆ చిత్ర నిర్మాణ సంస్థ.ఏప్రిల్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలనే ఆలోచన చేస్తున్నారట . అందుకే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను కూడా వేగవంతం చేసింది యూనిట్. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి కొరటాల శివ దర్శకుడు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి డి వి వి దానయ్య నిర్మాత.