కరోనా లాక్డౌన్ ముగిసిన వెంటనే సూపర్ స్టార్ మహేశ్ బాబు, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు బయల్దేరిన విషయం తెలిసిందే. విహారయాత్రకు వెళ్లిన మహేశ్ బాబు ఎప్పటికప్పుడు పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నాడు. అలాగే ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా మహేశ్ బాబుకు సంబంధించిన అప్డేట్స్ను పంచుకుంటుంది.
తాజాగా నమ్రత ’తెల్లవారు జామున 3 గంటలకు విమానం కోసం ఎదురుచూస్తోన్న మహేశ్ బాబు’ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ పోటో లో మహేశ్ బాబు కొత్త హెయిర్ స్టయిల్ లో కనిపిసున్నాడు. ఇప్పుడి ఈ పోటో కాస్త మహేశ్ బాబు కొత్త లుక్ అంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం మహేశ్ బాబు పరుశురామ్ దర్శకత్వం లో సర్కారు వారి పాట సినిమా లో నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ ఒక కథాయికగా నటిస్తోన్న… నివేదా థామస్ను మరో హీరోయిన్గా నటిస్తోన్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా త్రిపాత్రభినయం చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మహేష్ బాబు ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేశ్ బాబు తన భార్యాపిల్లలతో టూర్ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ఈ టాప్ విలన్ల రెమ్యునరేషన్ ఎంతంటే..?
హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!