టాలీవుడ్ హీరోలలో అందగాడు ఎవరంటే అందరు ఠక్కున చెప్పే పేరు ప్రిన్స్ మహేశ్ బాబు.మహేశ్ తన 25వ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా షూటింగ్లో మహేశ్ను కలవడానికి ఆయన లేడీ ఫ్యాన్స్ చాలా దూరం నుంచి వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న మహేశ్ షూటింగ్కు కాస్తా బ్రేక్ ఇచ్చి వారితో ఇలా ఫోటోలు దిగి వారికి ఆనందాన్ని పంచాడు మహేశ్.
మహేశ్కు లేడీ ఫ్యాన్సీ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే ఈ ఫోటో చూసిన వారందరు భామల మధ్య నిండు చంద్రుడిలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.ఇక మహేశ్ 25వ సినిమా షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటొంది.మహేశ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తుంది.ఈ సినిమాను దిల్ రాజు -అశ్వినీదత్ ఇద్దరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ 5న విడుదల చేయలని ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం మహేశ్ ఫస్ట్ టైం ఫుల్ గెడ్డం మీసంతో కనిపించనున్నాడు.