- Advertisement -
టీజర్తోనే అందరి దృష్టి ఆకర్షించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, రియా సుమన్, తన్యా హోప్ హీరో ,హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్పై ప్రశంసలు కురిపించాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.ఈ చిత్రం ట్రైలర్ చూశానని, ‘ఫ్రెష్ గా..ప్లెజెంట్ గా’ ఉందని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.
సంతోష్ తండ్రి దివంగత శోభన్ గారితో కలిసి తాను గతంలో పని చేశానని, సంతోష్ శోభన్ తో పాటు అతని టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నట్టు మహేష్ తెలిపాడు. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది నిర్మించటమే కాకుండా ఆయనే కథను కూడా అందించారు.జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.