- చిత్రంగా షెడ్యూల్ పోస్టర్ విడుదల
స్పైడర్ సినిమాను విజయం అనాలో.. అపజయం అనాలో తెలియదు కానీ సినిమా అయితే బాగానే ఆడిందబ్బా అని అభిమానులే కాదు ప్రేక్షకులు భావిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో మాత్రం హిట్టయ్యింది. ఏదో గిట్టని వారు.. దుష్ప్రచారం చేసేవారు ఈ సినిమాను తొక్కేశారు. ఎలాగైతేనేం ప్రిన్స్ మహేశ్బాబు ఇవేవీ పట్టించుకోడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందుకని సినీ పరిశ్రమలో మచ్చలేని హీరోగా మహేశ్బాబు ఉన్నాడు. అతడు స్పైడర్ తర్వాత కొంచెం విహార యాత్రకు వెళ్లొచ్చాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించాడు.
కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో మహేశ్ నటిస్తున్నాడు. ఆ సినిమా ఇంకా ఫైనల్ కాలేదు కానీ అవుతాదంట అని టాక్. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్ర శరవేగంగా సాగుతోంది. కాగా ఈ చిత్ర షూటింగ్ గురించి ఎవరూ చేయని విధంగా పోస్టర్ విడుదల చేశారు. ఏ షెడ్యూల్స్? ఎన్ని రోజులు షూటింగ్? ఏ ప్రాంతాల్లో అనే వివరాలు తెలుపుతూ చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది.
ప్రస్తుతం నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 7 వరకు తొలి షెడ్యూల్ హైదరాబాద్లో పూర్తవుతోంది. డిసెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు తమిళనాడులోని కరైకుడిలో షూటింగ్ చేస్తారని ఆ పోస్టర్లో ఉంది. అంతేకాకుండా 2018 ఏప్రిల్ 27వ తేదీన సినిమా విడుదల అంటూ పేర్కొన్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై డి. పార్వతీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.