Monday, May 20, 2024
- Advertisement -

బావ సినిమాపై ట్వీట్ చేసిన మ‌హేశ్ బాబు

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త‌న సొంత బావ అయిన సుధీర్ బాబుకు ఎప్పుడు పెద్దగా అండ‌గా నిల‌వ‌లేదు.స‌పోర్టుతో ఎంతో కాలం ఇండ‌స్ట్రీలో ఉండ‌లేమ‌న్న‌ది మ‌హేశ్ ఆలోచ‌న‌.అందుకే సుధీర్ బాబు సినిమా ఫంక్ష‌న్స్ అప్పుడు త‌ప్ప మిగ‌త స‌మ‌యంలో అత‌ని గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోడు.సుధీర్ బాబు కూడా తాను సొంతంగా ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.ఇటీవ‌లే స‌మ్మోహ‌నం సినిమాతో డీసెంట్ హిట్ కొట్టాడు సుధీర్ బాబు.ఆయ‌న ఇటీవ‌లే నిర్మాత‌గా మారి త‌న సినిమాను తానే నిర్మించుకుంటున్నాడు.

తన సొంత బ్యానర్ ఎస్ బి (సుధీర్ బాబు) ప్రొడక్షన్స్ లో వస్తున్న తొలి సినిమా `నన్ను దోచుకుందువటే`. సుధీర్ బాబు హీరోగా నటించాడు.తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.ఈ ట్రైల‌ర్‌పై సుధీర్ బాబు బావ మ‌హేశ్ బాబు ట్విట్ట‌ర్‌లో స్పందించారు.నిర్మాతగా సుధీర్ తొలి ప్రయత్నానికి బెస్ట్ విషెస్.. ట్రైలర్ చాలా ప్రామిస్సింగ్ గా ఉంది. ఆల్ ది బెస్ట్“ అని తెలిపాడు. సెప్టెంబర్ 21న థియేటర్లకు వెళ్లమని మహేష్ హింటిచ్చాడు.మ‌రి సుధీర్ బాబుకి నన్ను దోచుకుందువటే సినిమా మ‌రో హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -