Tuesday, April 30, 2024
- Advertisement -

మ‌హ‌ర్షిపై మ‌హేశ్ అసంతృప్తి.. రీ షూట్ చేస్తున్న‌వంశీ పైడిప‌ల్లి?

- Advertisement -

మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా మ‌హ‌ర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మ‌హేశ్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు. అశ్వీనిద‌త్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌హేశ్ పుట్టిన రోజున విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ ను రీసెంట్ గా దర్శక నిర్మాతలు .. మహేశ్ బాబు కలిసి చూశారట. కీలకమైన కొన్ని సన్నివేశాలు తాను ఆశించినట్టుగా రాలేదంటూ మహేశ్ బాబు అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. దాంతో దర్శకనిర్మాతలు అందుకు అంగీకరించినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తుంది. సినిమాను వ‌చ్చే ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌డానికి స‌న్న‌హాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -