Sunday, May 19, 2024
- Advertisement -

రికార్డు ధ‌ర‌కు మ‌హ‌ష్ మ‌హ‌ర్షి సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్..ఎంతంటె..?

- Advertisement -

భ‌ర‌త్ అనే నేను సినిమా త‌రువాత మ‌హేష్ బాబు 25 వ చిత్రంగా మ‌హ‌ర్షి రూపొందుతోంది. వంశి పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా నిర్మిత మ‌వుతోంది. సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. మరికొన్ని రోజుల్లో షూటింగు పార్టును పూర్తి చేసుకోనున్న ఈసినిమా గురించి వార్త‌ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. భరత్‌ అనే నేను లాంటి బిగ్ హిట్ తరువాత మహేష్ నటిస్తున్న సినిమా కావటంతో మహర్షి భారీ అంచనాలు ఉన్నాయి.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాపై .. అదే స్థాయిలో క్రేజ్ వుంది. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ మహర్షి రికార్డులు సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను 11 కోట్లకి అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు దక్కించుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు కూడా భారీరేటుకు అమ్ముడయ్యాయి. జెమినీ టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇందుకుగాను వాళ్లు 16.8 కోట్లను చెల్లించినట్టుగా తెలుస్తోంది.అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -