Friday, April 26, 2024
- Advertisement -

మ‌హేశ్‌ను క‌లిసిన పూరి.. సెట్స్‌పైకి త్వ‌ర‌లోనే కొత్త సినిమా

- Advertisement -

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో సినిమాలు చేయ‌డానికి టాప్ డైరెక్ట‌ర్లు క్యూలో ఉన్నారు. తమిళ ద‌ర్శ‌కులు సైతం మ‌హేశ్‌తో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్నారు కూడా ఉన్నారు. కాని మ‌హేశ్ కంగారుప‌డి ఏ సినిమా ప‌డితే ఆ సినిమా చేయ‌డం లేదు. క‌థ‌ల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మ‌హేశ్ ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా త‌రువాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కాని క‌థ న‌చ్చక‌పోవడంతో సుకుమార్‌ను రిజెక్ట్ చేశాడు మ‌హేశ్‌.

ఇక మ‌హేశ్‌తో సినిమా చేయ‌డానికి కొత్త ద‌ర్శ‌కులు సందీప్ వంగా, అనిల్ రావిపూడి వంటి వారు లైన్లో వ‌చ్చారు. వీరిద్ద‌రు చెప్పిన క‌థ ఏ క‌థ న‌చ్చితే వారితో సినిమా చేస్తాడ‌ని భావించారంద‌రు. కాని సీన్‌లోకి స‌డ‌న్‌గా పూరి జ‌గ‌న్నాథ వ‌చ్చారు. మంగ‌ళ‌వారం రాత్రి మ‌హేశ్ ఇంటికి వెళ్లి మరి త‌న ద‌గ్గ‌ర ఉన్న క‌థ‌ను చెప్ప‌డ‌ట పూరి. ఇది మ‌హేశ్‌కు గతంలో వినిపించిన జ‌ర‌గ‌ణ‌మ‌ణ క‌థే అని తెలుస్తుంది. క‌థ‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మ‌హేశ్‌కు క‌థ‌ను వినిపించాడ‌ట పూరి. క‌థ న‌చ్చిన‌ప్ప‌టికి పూరితో సినిమా చేయ‌డానికి తెగ భ‌య‌ప‌డిపోతున్నాడ‌ట మ‌హేశ్‌. ఎందుకంటే పూరి వ‌రుస ఫ్లాప్‌ల్లో ఉండ‌ట‌మే దీనికి కార‌ణం తెలుస్తుంది.

గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెండు సినిమాలు సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. పోకిరి , బిజినేస్‌మేన్ సినిమాలు వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. క‌థ న‌చ్చ‌డంతో ఖచ్చితంగా సినిమా చేద్దామని మాట ఇచ్చారట మ‌హేశ్‌. పూర్తి స్క్రిప్టుతో కనపడమని పూరితో మ‌హేశ్‌తో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. పూరి ప్ర‌స్తుతం హీరో రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మ‌హేశ్ సినిమాను మొద‌లుపెడ‌తాడ‌ట పూరి జ‌గ‌న్నాథ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -