Friday, May 17, 2024
- Advertisement -

మహేశ్ ఇచ్చిన మాట మేరకు.. ముందుకు వెళ్తున్నాడు!

- Advertisement -

“శ్రీమంతుడు” సినిమా విడుదల తర్వాత అటు తెలంగాణలో ఒక గ్రామాన్ని.. ఇటు ఆంధ్రప్రదేశ్ లో మరో గ్రామాన్ని దత్తత తీసుకొంటున్నానని ప్రకటించిన మహేశ్ బాబు ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టాడు.

ఏయే గ్రామాలను దత్తతకు స్వీకరించి… వాటిని అభివృద్ధి పరచాలనే అంశం గురించి కసరత్తు చేసి.. ముందుకు వెళ్తున్నాడు. తాజాగా మహేశ్ తను తెలంగాణలో ఏ గ్రామాన్ని దత్తత తీసుకోబోతున్నానో ప్రకటించాడు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో చర్చలు జరిపి ఈ విషంలో ఒక అభిప్రాయానికి వచ్చానని మహేశ్ చెప్పాడు. మహేశ్ తాజాగా చేసిన ట్వీట్ ప్రకారం… ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని సింధూపురం గ్రామాన్ని దత్తత తీసుకోనున్నాడు.

తను, తెలంగాణ మంత్రి కేటీఆర్ జరిపిన చర్చలతో ఈ అభిప్రాయానికి వచ్చినట్టుగా మహేశ్ వివరించాడు. దీన్ని బట్టి మహేశ్ తను చెప్పినట్టుగా దత్తత కార్యక్రమాలకు కసరత్తు చేసినట్టుగా స్పష్టం అవుతోంది. అలాగే బుర్రిపాలెం ను దత్తత తీసుకోవడానికి కూడా మహేశ్ బాబు కార్యాచరన సిద్ధంచేశాడు. ఈ విధంగా ఇచ్చిన మాట మేరకు మహేశ్ ముందుకు వెళ్తున్నాడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -