Saturday, May 4, 2024
- Advertisement -

‘మ‌హ‌ర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, చరణ్?

- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తాజాగా న‌టించిన చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తి కావ‌డంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వ‌చ్చే నెల 1 తేదిని ఫిక్స్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌స్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.


ఇండ‌స్ట్రీలో మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు మంచి స్నేహితుల‌ని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఒక‌రి సినిమా విడుద‌ల అవుతుంటే మ‌రోక‌రు విషెష్ చెబుతుంటారు. గ‌తంలో మ‌హేశ్ బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రైయ్యారు. ఇప్పుడు మ‌హ‌ర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌తో పాటు రామ్ చ‌రణ్ కూడా రావ‌డంతో ముగ్గురు హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ఇక హైద‌రాబాద్‌ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా ఇందుకు వేదికగా మారనుంది. మ‌హ‌ర్షి మ‌హేశ్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, సాంగ్స‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఈ సినిమాలో మ‌హేశ్‌కు జోడిగా పూజా హెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తోంది. సినిమాను మే 9న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -