మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సినిమా షూటింగ్ సాగుతోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకు విడుదలైన పాటలకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం కానుకగా విడుదల చేసే ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారని టాక్.
తొలుత నార్మల్ ట్రైలర్ను రిలీజ్ చేసి తర్వాత రిలీజ్ ట్రైలర్తో ఫ్యాన్స్కు కిక్ ఇవ్వాలని మహేష్ భావిస్తున్నారట. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా కర్ణాటక థియేట్రికల్ రైట్స్ను స్వాగత్ ఎంటర్ప్రైజెస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా పోకిరి తరహాలో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సినిమా తాజా షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 21 నుంచి మిగిలిన ఒక్క పాట (చివరి) షూటింగ్ను ప్రారంభించనున్నారు. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్పై చినబాబు నిర్మిస్తున్నారు.