ముంబైలో ఉగ్రదాడుల సమయంలో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలొదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ మేజర్. దేశభక్తిని చూపించే ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్గా హీరో అడవి శేష్ మెప్పించాడు. ఆర్మీలో చేరాలనుకుంటున్న వారికి సాయం చేస్తామని ఈ సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
తాజా స్కూలు పిల్లకు ఓ ఆఫర్ ఇచ్చింది. గ్రూప్ టికెట్లపై స్కూళ్లకు రాయితీ కల్పిస్తున్నట్లు స్వయంగా అడివి శేష్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. మేజర్ను హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన శేష్..చిన్న పిల్లల నుంచి కూడా మంచి స్పందన వస్తోందన్నారు.
ఇంకా చాలా మంది విద్యార్థులు మేజర్ గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించాడు. అందుకే ఈ ఆఫర్ అని ప్రకటించాడు. ఓ వాట్సాప్ నెంబర్ ను పోస్టు చేసి.. ఓ ఫార్మ్ ఫిల్ చేస్తే ఈ ఆపర్ లభిస్తుందని వెల్లడించాడు.
Also Read
1.సీక్రెట్ బయటపెట్టిన దర్శకుడు