థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న అడివి శేష్ మరోసారి సరికొత్త పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. అందరు హీరోల్లా కాకుండా తనకు నచ్చిన జానర్లో సినిమాలను తీస్తూ.. వాటిలో హీరోగా చేస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్నాడు. దర్శకుడిగా కెరీర్ ఆరంభించి హీరోగా సక్సెస్ బాటలో నడుస్తున్నాడు. అడివి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ ‘ఎవరు’ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా టీజర్ రిలీజైంది.
తెలుగు వర్షన్ ను మహేశ బాబు, హిందీ వర్షన్ ను సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. 1.34 నిమిషాలు ఉన్న ఈ టీజర్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ శశికిరణ్ తెరకెక్కించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జులై 2న విడుదల కానుంది. శశికిరణ్ తిక్కా డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.
మన బోర్డర్లో ఆర్మీ ఎలా ఫైట్ చేయాలి? ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి? అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్ పని’’ అంటూ శేష్ చెబుతున్న డైలాగ్స్ ఉద్విగ్నంగా ఉన్నాయి. సోనీ పిక్చర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.
పవన్ పిల్లలతో అడవిశేషు.. ఫోటో వైరల్!