టాలీవుడ్ లో మల్టీటాలెంటెడ్ పర్సన్ గా ఇప్పటికే మంచి పేరు అడవి శేష్ సొంతం. దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన అడవి శేషు తర్వాత చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఆ తర్వాత హీరోగా తన సత్తా చాటుతున్నాడు. దర్శకుడు అడివి సాయికిరణ్ కు తమ్ముడి వరస అవుతాడు. అడవి శేషు పవన్ పిల్లలతో ఎంత సన్నిహితంగా ఉంటారో కొత్తగా చెప్పనవసరం లేదు.
ఇదిలా ఉంటే ‘ఎవరు’ చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ పిల్లలు అఖిరా, ఆద్యల అడవిశేషుకి మంచి ఫ్యాన్స్ అయ్యారు. అడవి శేషు ని అన్నా అని పిలుస్తారని అలాగే అడవిశేషు ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని కూడా రేణు దేశాయ్ చాలా సార్లు చెప్పారు. తాజాగా ఇటీవల అడవి శేషు అకీరా ఆద్యాలను కలిసినట్లు తెలుస్తోంది.
అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి పవన్ పిల్లలను ఎప్పటికప్పుడు చూస్తున్న అభిమానులు అడవి శేషు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం అడవి శేషు మేజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.