Monday, May 6, 2024
- Advertisement -

సినీ ఇండస్ట్రీని ఏలేది..టాలీవుడే!

- Advertisement -

టాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ – రష్మిక మందన్నా ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. రాబోయే రోజుల్లో భారతీయ సినీ పరిశ్రమను ఏలేది టాలీవుడే అన్నారు మల్లారెడ్డి.రానున్న ఐదేళ్లలో తెలుగువారు హాలీవుడ్, బాలీవుడ్‌ని ఏలుతారు. ముంబై, బాలీవుడ్ పని అయిపోయిందని చెప్పారు. హైదరాబాద్ సిటీ దేశంలోని గొప్పదిగా ఎదుగుతుందన్నారు.

రాజమౌళి, దిల్ రాజు, సందీప్ వంగా వంటి తెలివైన వారు ఉన్నారని చెప్పుకొచ్చారు. హిందుస్థాన్ మే ఏక్ హై సిటీ హై, వో హై హైదరాబాద్ అన్నారు మల్లారెడ్డి.
తెలుగు వారు తెలివైన వారని చెప్పారు. ఇప్పుడు మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -